‘‘నో డేటింగ్ క్లాజ్’’ పై సంతకం చేసి సినిమాలో నటించిన నిధి అగర్వాల్
ABN , First Publish Date - 2022-01-19T22:00:15+05:30 IST
సినిమాల్లో నటించే ముందు హీరో, హీరోయిన్లు కాంట్రాక్ట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్లో అనేక నియమ, నిబంధనలు ఉంటాయి
సినిమాల్లో నటించే ముందు హీరో, హీరోయిన్లు కాంట్రాక్ట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్లో అనేక నియమ, నిబంధనలు ఉంటాయి. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక సినిమా చేయడానికి ‘‘నో డేటింగ్ క్లాజ్’’ పై సంతకం చేసిందట. ఆమె ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య పంచుకొంది.
నిధి అగర్వాల్ ‘‘మున్నా మైకేల్’’ సినిమాతో బాలీవుడ్లో వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం 2017లో విడుదలైంది. టైగర్ ష్రాఫ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ కీలకపాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం పాలైంది. అయినప్పటికి, నిధి నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా నిధి అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘మున్నా మైకేల్’’ చిత్రంలో నటించేందుకు తను నో డేటింగ్ క్లాజ్పై సంతకం చేశానని చెప్పింది.
‘‘ నేను సినిమా కాంట్రాక్ట్లపై సంతకం చేసేటప్పుడు సరిగ్గా చదవను. ‘మున్నా మైకేల్’ సినిమా కోసం ‘నో డేటింగ్ క్లాజ్’ పై సంతకం చేశాను. సినిమాలో అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోమేసింది. హీరోయిన్ కాబోతున్నానని తెలియగానే ఆనందమేసింది. మిగిలిన విషయాల గురించి ఆలోచించలేదు. ఆనందంతో అన్నింటిని మరిచిపోయి ఆ సినిమా కాంట్రాక్ట్పై సంతకం చేశాను’’ అని నిధి అగర్వాల్ చెప్పింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ సినిమాలో హీరోగా నటించిన టైగర్ ష్రాఫ్ మాత్రం అటువంటి నిబంధనపై సంతకం చేయలేదు. అతడు ఆ సినిమా చేసే సమయానికి హీరోగా ఎదిగారు. ‘‘మున్నా మైకేల్’’ అనంతరం నిధి అనేక తమిళ్, తెలుగు సినిమాల్లో నటించింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘‘హరి హర వీర మల్లు’’లోను ఆమె నటించబోతోంది.