సోనమ్ నివాసంలో చోరీ.. బంగారం వ్యాపారి అరెస్టు..
ABN , First Publish Date - 2022-04-15T22:38:16+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి దాదాపుగా రూ.2.4కోట్ల నగదు, బంగారు నగలను కాజేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి దాదాపుగా రూ.2.4కోట్ల నగదు, బంగారు నగలను కాజేశారు. ఈ కేసును న్యూ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ నర్సు, ఆమె భర్తను గతంలోనే అరెస్టు చేశారు. ఈ దొంగిలించిన నగదును కొనుగోలు చేసిన బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కల్కాజీకీ చెందిన దేవ్ వర్మ అనే బంగారం వ్యాపారి ఈ నగలను కొన్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి దాదాపుగా రూ. కోటి విలువ జేసే 100 వజ్రాలు, 6గోల్డ్ చెయిన్స్, డైమండ్ గాజులు, డైమండ్ బ్రాస్లేట్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో భాగంగానే అంతకు ముందు నర్సు అపర్ణ రుత్ విల్సన్, ఆమె భర్త నరేశ్ కుమార్ సాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ ఇంట్లో అపర్ణ కేర్ టేకర్గా పనిచేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హై ప్రోపైల్ కేసు కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రహస్యంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.