Kiara advani: అక్కడ సారీ చెప్పడానికి వెనకాడను
ABN, First Publish Date - 2022-06-26T00:06:53+05:30
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కియారా అడ్వాణీ (kiara advani). ఆ సినిమా సక్సెస్ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో అవకాశం అందుకున్నారు. ఇప్పుడు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్సీ15’లో చరణ్ సరసన మరోసారి అవకాశం అందుకున్నారు. మరోపక్క బాలీవుడ్లోనూ ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘జుగ్ జుగ్ జియో’ (jugjugg jeeyo)చిత్రం ఇటీవల విడుదలైంది.
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కియారా అడ్వాణీ (kiara advani). ఆ సినిమా సక్సెస్ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో అవకాశం అందుకున్నారు. ఇప్పుడు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్సీ15’లో చరణ్ సరసన మరోసారి అవకాశం అందుకున్నారు. మరోపక్క బాలీవుడ్లోనూ ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘జుగ్ జుగ్ జియో’ (jugjugg jeeyo)చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రమోషన్స్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారీ బ్యూటీ. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్షిప్, తద్వారా వచ్చే సమస్యలపై ఆమె స్పందించారు.
‘‘ఏ బంధంలోపైనా గొడవలు రావడం సహజం. భార్యభర్తల మధ్య చిన్న వివాదం జరిగితే భర్తే మొదట సారీ చెబుతారని చాలాసార్లు విన్నా. గొడవ ఎవరి వల్ల మొదలైనా క్షమాపణ చెప్పడమనేది ఇద్దరికీ సమానమే. పెళ్లి, దాని తర్వాత వచ్చే గొడవల గురించి నేను మాట్లాడను. కానీ ఏ బంధంలోనైనా ఇద్దరి మధ్య ఏదన్న గొడవ జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో తప్పులేదని నా అభిప్రాయం. అలాంటి సమస్యలో నేను ఉంటే గొడవకి అంతటితో ఫుల్స్టాప్ పెట్టి బంఽధం ముందుకు నడిచేలా చేయాలనుకుంటా. నేను రిలేషన్షిప్లో ఉండి ఏదన్నా గొడవ జరిగితే సారీ చెప్పడానికి మొహమాట పడను, ఇబ్బంది అంతకన్నా పడను. ఎందుకంటే ప్రేమ అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం’’ అని కియారా అడ్వాణీ (Kiara adwani) అన్నారు. వరుణ్ ధావన్కు జంటగా ఆమె నటించిన తాజా చిత్రం ‘జుగ్ జుగ్ జియో’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది.