Kareena Kapoor: విలాసవంతమైన కారు కొనుగోలు.. ధర వింటే షాకే..
ABN , First Publish Date - 2022-10-03T02:08:20+05:30 IST
కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. ఖరీదైన వైట్ మెర్సిడెస్ బెంజ్ను సొంతం చేసుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. ఖరీదైన వైట్ మెర్సిడెస్ బెంజ్ను సొంతం చేసుకున్నారు. తమ పిల్లలు జహంగీర్ అలీ ఖాన్ (Jehangir Ali Khan) తో కలసి కారులో సరదాగా రైడ్కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరీనా ఫ్యాన్స్ అందరు ఈ పిక్స్ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ కారు ధర విని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ బెంజ్ కారు ధర రూ.2కోట్లు ఉంటుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ కారు మోడల్ మెర్సిడెస్ యస్350డీ అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతులు రూ.60లక్షల విలువ చేసే వ్రాంగ్లర్ కారుకు తమ గ్యారేజీలో చోటిచ్చారు. సైఫ్ అలీఖాన్ నటించిన సినిమా విక్రమ్ వేద (Vikram Vedha) విడుదల కాగానే వీరు కొత్త కారును కొనడం విశేషం. ‘విక్రమ్ వేద’ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. తమిళ్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ కు రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. ఒరిజనల్ కు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రినే రీమేక్ను తెరకెక్కించారు. ఇక కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ లో చివరగా కనిపించింది. హన్సల్ మెహతా ప్రాజెక్టులోను నటించనుంది. త్వరలోనే ఓటీటీకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.