Koffee With Karan: షో గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన కరణ్ జోహార్
ABN , First Publish Date - 2022-05-04T19:44:17+05:30 IST
‘కాఫీ విత్ కరణ్’.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరించిన ఈ టాక్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు...
‘కాఫీ విత్ కరణ్’.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరించిన ఈ టాక్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరణ్ జోహార్ ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ టీవీ ప్రేక్షకులను అలరించేవాడు. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోలో బాలీవుడ్తోపాటు ఇతర పరిశ్రమల్లోని సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాడు. తాజాగా ఈ షో ఏడో సీజన్ గురించి న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది.
త్వరలోనే ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7 ప్రారంభం కాబోతుందని.. అందులో మొదటి ఎపిసోడ్కి గెస్టులుగా బాలీవుడ్ కొత్త దంపతులు అలియా భట్, రణ్బీర్ కపూర్ హాజరుకానున్నారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ షో గురించి కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు.
ఇన్స్టాగ్రామ్లో కరణ్ చేసిన ట్వీట్లో.. ‘హలో.. కాఫీ విత్ కరణ్ ఇప్పటి వరకూ 6 సీజన్లు పూర్తి చేసుకొని నా జీవితంలో, అలాగే మీ జీవితంలోనూ ఓ భాగంగా మారిపోయింది. పాప్ కల్చర్పై ప్రభావం చూపి, ఆ చరిత్రలో నా కంటూ స్థానాన్ని సంపాదించుకున్నానని అనుకుంటున్నా. అయితే.. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సీజన్ 7 రాదని, ఈ షో ఇకపై కొనసాగదని చెప్పేందుకు ఎంతో బాధ పడుతున్నా. కరణ్ జోహార్’ అంటూ రాసుకొచ్చాడు.
దీంతో ఎంతోమంది షో అభిమానులు, పలువురు కరణ్ పోస్ట్పై స్పందిస్తూ బాధగా కామెంట్స్ పెడుతున్నారు. ‘అసలేమైంది’, ‘ఎందుకు ఆపేశారు’, ‘అది చాలామంచి షో’, ‘సీజన్ 7కి కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తూ.. ఈ షోని మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు.