Kangana Ranaut: ఆ భయం వెంటాడుతోంది!

ABN , First Publish Date - 2022-12-20T14:39:02+05:30 IST

ఇటీవల ఢిల్లీలో జరిగిన యాసిడ్‌ దాడి తనకెంతో భయం కలిగించిందని కంగనా రనౌత్‌(Kangana Ranaut) పేర్కొన్నారు. ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా సమాజంలో జరుగుతున్న భయంకర (kangana pretended)సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయని ఆమె అన్నారు.

Kangana Ranaut: ఆ భయం వెంటాడుతోంది!

ఇటీవల ఢిల్లీలో జరిగిన యాసిడ్‌ దాడి తనకెంతో భయం కలిగించిందని కంగనా రనౌత్‌(Kangana Ranaut) పేర్కొన్నారు. ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా సమాజంలో జరుగుతున్న భయంకర (kangana pretended)సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయని ఆమె అన్నారు. తన కుటుంబంలో జరిగిన యాసిడ్‌ దాడి గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. తనపై కూడా ఇలాంటి దాడి జరుగుతుందేమో అని భయపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘‘నా సోదరి రంగోలి యాసిడ్‌ దాడికి గురైంది. ఆమెకు 52 శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆ సంఘటనతో నా సోదరి శారీరకంగా, మానసికంగా ఎంతో బాధకు గురైంది. ఆ సంఘటన గుర్తొస్తే నాపై కూడా యాసిడ్‌ దాడి జరుగుతుందేమేనని ప్రతిక్షణం భయపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఎవరైనా నా పక్కకు వస్తుంటే ముఖం దాచుకుంటున్నాను’’ అని కంగనా తెలిపింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘చంద్రముఖి 2’ చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - 2022-12-20T17:30:03+05:30 IST