Kangana Ranaut: పార్లమెంట్‌లో షూటింగ్ కోసం అనుమతి కోరిన నటి

ABN , First Publish Date - 2022-12-19T14:19:32+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ (Emergency) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Kangana Ranaut: పార్లమెంట్‌లో షూటింగ్ కోసం అనుమతి కోరిన నటి

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ (Emergency) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హాయాంలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రాత్రని పోషిస్తున్న కంగనా.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేస్తోంది.

అయితే ఈ మూవీలోని పలు కీలక సన్నివేశాలని పార్లమెంట్‌ (Parliament)లో చిత్రీకరించాలని కంగనా అనుకుంటుందట. అందుకే పార్లమెంట్ పరిసరాల్లో షూటింగ్ కోసమై లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఈ చిత్రబృందం అనుమతి కోరిందని సమాచారం. కంగనా లేఖని అధికారులు పరిగణలోకి తీసుకున్నారని.. అయితే పర్మిషన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తోంది.

అయితే.. మామూలుగా అయితే పార్లమెంట్ పరిసరాలను ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అక్కడ అనుమతి ఉండదు. అది ప్రభుత్వ అధికారిక పని అయితే మాత్రమే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుంది. సాధారణంగా దూరదర్శన్, సంసద్ టీవీ యాజమాన్యానికి మాత్రమే తమ ప్రోగ్రామ్స్‌ కోసం ఇక్కడ షూటింగ్ చేసేందుకు అనుమతి ఇస్తుంటారు.

Updated Date - 2022-12-19T14:24:11+05:30 IST