సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kangana Ranaut: ‘జిందాబాద్ మృణాల్ మేడం’.. సీతారామం టీంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ ప్రశంసలు

ABN, First Publish Date - 2022-09-22T18:33:07+05:30

ఇటీవలికాలంలో తెలుగులో వచ్చిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీల్లో ‘సీతారామం(Sita Ramam)’ ఒకటి. హాను రాఘవపూడి దర్శకత్వంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో తెలుగులో వచ్చిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీల్లో ‘సీతారామం(Sita Ramam)’ ఒకటి. హాను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఈ చిత్రం గత నెలలో విడుదలైన సంచలన విజయం అందుకుంది. ఈ మూవీని చూసిన ఎందరో విమర్శకులు ప్రశంసలు కురింపించారు. అంతేకాకుండా.. ఇతర చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు తారలు కూడా ఈ మూవీని మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) సైతం స్పందిస్తూ.. మూవీపై, ముఖ్యంగా మృణాల్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వర్షం కురిపించింది.


కంగన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేసిన స్టోరీలో.. ‘చివరికీ సీతారామం సినిమా చూసే సమయం దొరికింది. ఒక అద్భుతమైన అనుభవం అనే చెప్పాలి. ఓ ఎపిక్ లవ్ స్టోరీ. అసామాన్యమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం. హను రాఘవపూడి(Hanu Raghavapudi)కి కంగ్రాట్స్. అన్ని విభాగాల్లోనూ సీతారామం అద్భుతం’ అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో మృణాల్ గురించి రాస్తూ.. ‘సీతారామం నటులందరూ చాలా అద్భుతంగా చేశారు. కానీ.. నా దృష్టిని మొత్తం మృణాల్ ఠాకూర్ ఆక్రమించేసింది. నటనలో చాలా డిగ్నిటీ కనిపించింది. మరే నటి ఈ స్థాయిలో చేయలేదు. నటుల ఎంపిక చాలా చక్కగా కుదిరింది. రాణిలా చించేసింది. జిందాబాద్ ఠాకూర్ మేడం. సీతారామంతో ఇండస్ట్రీని రూల్ చేశావు’ అని చెప్పుకొచ్చింది. అయితే.. సీతారామం ఇటీవలే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో విడుదలై అక్కడ కూడా ఆకట్టుకుంటోంది.


కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది కంగనా. అయితే.. అనంతరం చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధాకడ్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకే కంగనా ఆశల్లన్నీ ప్రస్తుతం చేస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాపైనే పెట్టుకుంది. 1995లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విదించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్ర అయిన ఇందిరగా కంగన నటిస్తోంది. ఇటీవలే విడుదలై ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ వీడియోతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 

Updated Date - 2022-09-22T18:33:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!