Kangana Ranaut: భారతీయుడిగా సిగ్గుపడాలి.. ఆమీర్ఖాన్పై కంగన విమర్శలు
ABN , First Publish Date - 2022-11-02T19:44:52+05:30 IST
బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తన చిత్రాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది..
బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తన చిత్రాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగన.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్(Aamir Khan)పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘సూపర్స్టార్లకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. రూ. 2 కోట్లు విలువ చేయని పనికి రూ.200 కోట్లు తీసుకుంటారు. షూటింగ్లకి వెళ్లడానికి సాధారణ విమానాలను వాడకుండా చార్డెడ్ ఫ్లైట్లను తెప్పించుకుంటారు. అయితే.. ప్రస్తుతం వారి స్టార్డమ్ను ప్రేక్షకులే ప్రశ్నిస్తున్నారు. అమీర్ ఖాన్ గారి విషయానికి వస్తే, నేను బహిష్కరణ సంస్కృతి గురించి ప్రత్యేకంగా మాట్లాడటం లేదు. కానీ సాధారణంగా.. దేశం కొంత ఉద్రిక్తతలో ఉన్నప్పుడు, టర్కీ మనకు వ్యతిరేకంగా ఏదో పని చేసింది. కానీ.. ఆమీర్ ఖాన్ అక్కడికి వెళ్లి వారికి ఆయన సమ్మతిని తెలిపారు. వారితో ఫొటోలు తీసుకున్నారు. మన దేశంలో అసహనం ఉందని అందరికీ చెప్పి ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్టని దిగజార్చారు. మీరు భారతీయుడిగా ఉన్నందుకు అసహ్యించుకుంటున్నారు. దానికి మీరు సిగ్గు పడాలి’ అని చెప్పుకొచ్చింది.
అలాగే.. ఆమీర్ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) సినిమా ఫ్లాప్ గురించి కూడా కంగన మాట్లాడింది. ‘ఆ సినిమా ఫ్లాపుకి బాయ్కాట్ (Boycott) ట్రెండ్కి ఏమాత్రం సంబంధం లేదు. సినిమాలో ఏం లేదు కాబట్టి ఆడలేదు’ అని కంగనా తెలిపింది. కాగా.. కంగనా ప్రస్తుతం మాజీ ప్రధాని ఇందిరగాంధీ (Indira Gandhi) హయంలో వచ్చిన ఎమర్జెన్సీ ఆధారంగా వస్తున్న ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ కంగనానే ఇందిర పాత్రని చేస్తోంది. ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.