సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ఝుండ్’ సినిమాపై పిటిషన్ వేసిన ఫిల్మ్ మేకర్.. జరిమానా విధించిన హై‌కోర్టు..

ABN, First Publish Date - 2022-03-06T01:25:52+05:30

హైదరాబాద్ ఫిల్మ్ మేకర్‌ నంది చిన్ని కుమార్‌కు తెలంగాణ హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ ఫిల్మ్ మేకర్‌ నంది చిన్ని కుమార్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 10లక్షలు జరిమానా విధించింది. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘ఝుండ్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ చర్యకు పూనుకుంది. గతంలో కుదిరిన రాజీ ఒప్పందం రద్దు చేయాలని సివిల్ కోర్టును ఆశ్రయించాక వాస్తవాలను తొక్కివెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జరిమానాను విధిస్తూ 30రోజుల్లోగా ప్రధానమంత్రి సహాయనిధికి జమచేయాలని కోరింది. 


ఫుట్‌బాల్ ఆటగాడు విజయ్ బార్సే జీవితం ఆధారంగా ‘ఝుండ్’ను తెరకెక్కించారు. ఈ సినిమాకు నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. టీ సిరీస్ నిర్మించింది. గతంలోనే నంది చిన్ని కుమార్ టీ సిరీస్ వద్ద రూ. 5కోట్లు తీసుకుని రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మూవీ విడుదలకు ముందు మళ్లీ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆ విషయాన్ని తప్పుబట్టింది.

Updated Date - 2022-03-06T01:25:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!