Aamir Khan, రణ్బీర్ కపూర్తో మల్టీస్టారర్.. బాలీవుడ్ డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2022-05-08T15:38:08+05:30
‘సాయా’ సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అనురాగ్ బసు. ఈ దర్శకుడు 2020లో వచ్చిన ‘లూడో’తో దేశవ్యాప్తంగా...
‘సాయా’ సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అనురాగ్ బసు (Anurag Basu). ఈ దర్శకుడు 2020లో వచ్చిన ‘లూడో’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాజాగా ఈ డైరెక్టర్ గురించి క్రేజీ రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), రణ్బీర్ కపూర్తో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడనేది ఆ వార్తా సారాంశం. అంతేకాకుండా ఈ సినిమా ఆమిర్ ఖానే స్వయంగా తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఈ విషయంపై నెట్టింట విపరీతంగా చర్చ జరిగింది. వినూత్న చిత్రాలతో గుర్తింపు పొందిన అనురాగ్ ఆ స్టార్స్తో ఎటువంటి మూవీని తెరకెక్కిస్తాడో చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ ఎగ్జాయిటింగ్గా కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించాడు. ఆయన ట్విట్టర్లో చేసిన పోస్ట్లో.. ‘ఈ రోజు ఆమిర్, రణ్బీర్ కపూర్తో నా కొత్త చిత్రం ఉంటుందనే వార్తలతో మేల్కొన్నాను.. ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో మల్టీస్టారర్ వార్తలన్ని పుకార్లేనని క్లారిటీ వచ్చినట్లైంది.
అనురాగ్ 2012లో వచ్చిన ‘బర్ఫీ’, అలాగే 2016లో వచ్చిన ‘జగ్గా జాసూస్’ సినిమాలకి రణబీర్తో కలిసి పనిచేశాడు. మరోవైపు, అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’లో రణబీర్ అతిథి పాత్రలో నటించాడు. అందులో సినిమా చివరి సన్నివేశం కోసం స్క్రీన్పై కలిసి మెరిశారు. దీంతో వారి కాంబినేషన్లో పుల్ లెంత్ సినిమా రానున్నట్లు వార్తలు వచ్చాయి.