రిసెప్షన్ ప్రదేశాన్ని మార్చిన అలియా భట్, రణ్బీర్ కపూర్
ABN, First Publish Date - 2022-04-14T21:14:19+05:30
బాలీవుడ్ లవ్బర్డ్స్ అలియా భట్-రణ్బీర్ కపూర్ భార్యాభర్తలయ్యే క్షణం రానే వచ్చింది. ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు బీ-టౌన్ గ్లామరస్ జోడీ.
బాలీవుడ్ లవ్బర్డ్స్ అలియా భట్-రణ్బీర్ కపూర్ భార్యాభర్తలయ్యే క్షణం రానే వచ్చింది. ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు బీ-టౌన్ గ్లామరస్ జోడీ. జుహు ప్రాంతంలోని బహుళ అంతస్థుల భవనం... ‘వాస్తు’లో వీరి వివాహ కోలాహలం కొనసాగుతోంది. ఇక బాలీవుడ్ హై ప్రొఫైల్ వెడ్డింగ్కి కొందరు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని ముంబై మీడియా గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తోంది.
ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే పెళ్లి పీటలెక్కాలని నిర్ణియించుకున్న ఆలియా, రణబీర్ రిసెప్షన్ మాత్రం ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారని కొందరంటున్నారు. సెలబ్రిటీలందరినీ ఆహ్వానించి తాజ్ హోటల్లో భారీ ఎత్తున విందును ఈ జంట ఇవ్వాలనుకున్నారని సమాచారం. కానీ, అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రిసెప్షన్ జరిగే ప్రదేశాన్ని మార్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘వాస్తు’లోనే విందును ఇవ్వాలనుకుంటున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రిసెప్షన్కు 100మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందించనున్నట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్ను తగ్గించారట. గతేడాది ‘వాస్తు’లో రణ్బీర్ కపూర్ ఓ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందు తను తల్లిదండ్రులు రిషీ కపూర్, నీతూ కపూర్తో కలసి ఉండేవాడు. అలియా భట్కు కూడా ‘వాస్తు’లో సొంత అపార్ట్మెంట్ ఉంది.
Updated Date - 2022-04-14T21:14:19+05:30 IST