Prithviraj లో ముందుగా అనుకున్నది Akshay ను కాదట.. ప్రాజెక్ట్లోకి Yash Raj Films ఎంట్రీతో..
ABN, First Publish Date - 2022-05-16T23:08:21+05:30
యాక్షన్ కథలతో బాలీవుడ్లో ఫేమ్ సంపాదించుకున్న నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
యాక్షన్ కథలతో బాలీవుడ్లో ఫేమ్ సంపాదించుకున్న నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ‘పృథ్వీరాజ్’ (Prithviraj) సినిమాలో నటించాడు. మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితమే ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో టైటిల్ రోల్కు అక్షయ్ను ఎంపిక చేయడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. ‘పృథ్వీరాజ్’ రిలీజ్కు దగ్గర పడుతుంటంతో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో హల్చల్ చేస్తుంది.
ఈ సినిమాలో చంద్ర ప్రకాష్ ద్వివేది మొదట అక్షయ్ను హీరోగా అనుకోలేదట. సన్నీ డియోల్ (Sunny Deol)తో ఈ చిత్రం చేయాలనుకున్నారట. కానీ, యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films) సీన్లోకి రావడంతోనే పరిస్థితులు తారుమారయ్యాయి. హీరోను రీ ప్లేస్ చేశారు. చంద్ర ప్రకాష్ గతంలో ‘మొహల్లా అస్సీ’(Mohalla Assi) సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించాడు. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా గురించి వీరిద్దరు అనేక చర్చలు జరిపారు. చిత్రంలోని లుక్, వాయిస్ ఓవర్ తదితర విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు. సినిమా సెట్స్ పైకీ వెళ్లే దశలో యశ్ రాజ్ ఫిలింస్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బడా సంస్థ రావడంతోనే పరిస్థితులు తారుమారయ్యాయి. సన్నీ డియోల్కు బదులుగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న హీరోతో ఆ సంస్థ సినిమా చేయాలనుకుంది. దీంతో సన్నీ ప్లేస్లోకి అక్షయ్ కుమార్ను తీసుకున్నారు. ‘పృథ్వీరాజ్’ లో సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.