బాలీవుడ్ని సౌత్ సినిమాలు ఏలుతున్నాయా.. అజయ్ దేవ్గణ్ రియాక్షన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2022-02-16T16:31:35+05:30
బాలీవుడ్లోని పాపులర్ స్టార్ హీరోల్లో అజయ్ దేవ్గణ్ ఒకరు. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు...
బాలీవుడ్లోని పాపులర్ స్టార్ హీరోల్లో అజయ్ దేవ్గణ్ ఒకరు. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. తాజాగా ఈ నటుడు ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ వెబ్సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హట్స్టార్లో విడుదల కానుంది. దీంతో ప్రొడక్షన్ హౌస్ ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ముంబైలో జరిగిన ఆ కార్యక్రమంలో అజయ్ దేవ్గణ్కి టాలీవుడ్ సినిమాల విజయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అజయ్ని.. ‘బాలీవుడ్ మార్కెట్ని సౌత్ సినిమాలు ఆక్రమిస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి’ అని ఓ రిపోర్టర్ అడిగాడు. దానికి సమాధానంగా.. ‘అదంతా ఉత్తదే. నిజానికి కరోనా కారణంగా 3, 4 నెలల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కాబట్టి హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ పరిశ్రమల నుంచి ఏ మంచి మూవీ విడుదలై ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే విడుదలైనా సూర్యవంశీ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధించిందని తెలిసిందే కదా. పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత ఏ మూవీస్ ఏలాతాయో తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.