Adipurush: ఒక్కటి.. ఏదైనా ఒక్కటి ప్లీజ్.. ఇకనైనా మేలుకో అంటూ మూవీ టీంపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్
ABN, First Publish Date - 2022-05-25T15:35:56+05:30
‘బాహుబలి’ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన టాలీవుడ్ హీరో ప్రభాస్. ఈ సిరీస్ సినిమాల
‘బాహుబలి’ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన నటుడు ప్రభాస్. ఈ సిరీస్ సినిమాల తర్వాత ఈ హీరో చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూవీ టీం 2020లోనే ప్రకటించింది. అప్పటి నుంచి కేవలం రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), సీతగా కృతిసనన్ (Kriti Sanon) నటిస్తున్నారనే బేసిక్ సమాచారం మాత్రమే చిత్రబృందం ఇచ్చింది. అప్పటి నుంచి ఓ పోస్టర్గానీ, లుక్గానీ, టీజర్గానీ బయటికి రాలేదు. అసలు సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటికి రావట్లేదు.
ఇది ఈ మూవీ టీంపై ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో ‘Wake Up Team Adipurush’ అనే యాష్ ట్యాగ్ని ట్రేండింగ్లోకి తెచ్చి ఈ మూవీ టీంని, దర్శకుడు ఓం రౌత్ని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. కొందరు ఫ్యాన్స్ ఫన్నీ వేలో ట్వీట్స్ చేస్తుండగా.. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఓ ప్రభాస్ అభిమాని ఓం రౌత్ని ఉద్దేశిస్తూ అయితే.. ‘సినిమా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ మూవీకి ఎందుకు హైప్ క్రియేట్ చేయట్లేదు. అలాంటప్పుడు పాన్ ఇండియా స్టార్తో ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయడంలో అర్థం ఏం ఉంది. కాబట్టి ఆదిపురుష్ గురించి సీరియస్గా తీసుకోండి’ అంటూ కొంచెం ఘాటుగా విమర్శించాడు. చాలామంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.