ఐదేళ్లకి షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మాస్త్ర’.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2022-03-29T18:47:57+05:30
బాలీవుడ్ యువ నటుడు రణ్బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’.
బాలీవుడ్ యువ నటుడు రణ్బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సినీయర్ హీరో అక్కినేని నాగార్జున సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ సిరీస్లో మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని దర్శకుడు అయాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
షూటింగ్ పూర్తైన తర్వాత వారణాసిలో తీసిన రెండు పిక్స్ని అయాన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అందులో మొదటిది.. రణ్బీర్, అలియాతో కలిసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ని సందర్శించిన పిక్ కాగా.. కొందరు వ్యక్తులతో కలిసి రణ్బీర్, అలియా బోట్లో ఉన్న పిక్. వాటికి.. ‘చివరికి... ఇది పూర్తైంది. మేము ‘బ్రహ్మాస్త్ర’ కోసం మొదటి షాట్ తీసి ఐదేళ్లు గడిచిపోయాయి. చివరికి లాస్ట్ షాట్ని తీశాం. ఇది ఖచ్చితంగా నమ్మశక్యం కాని, సవాలుతో కూడిన, జీవితంలో ఒక్కసారే వచ్చే ఛాలెంజ్. శివుడి ఆశ్శీసులతో ఆయన స్ఫూర్తితో నిండిన నగరం వారణాసిలో ‘మొదటి భాగం: శివ’ చిత్రీకరణను పూర్తి చేశాం. అది కూడా అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథ్ మందిరంలో, స్వచ్ఛమైన వాతావరణంలో పూర్తి చేయడం అదృష్టంగా భావిస్తున్నా. రాబోయే రోజులు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. 09.09.2022న మీ అందరి ముందుకు వస్తున్నాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Updated Date - 2022-03-29T18:47:57+05:30 IST