Akshay Kumar: ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసిన హీరో
ABN, First Publish Date - 2022-09-25T00:46:21+05:30
బాలీవుడ్లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాల్లో నటిస్తుంటాడు. అంతే వేగంతో ఆ మూవీస్ను విడుదల చేస్తుంటాడు. తాజాగా
బాలీవుడ్లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాల్లో నటిస్తుంటాడు. అంతే వేగంతో ఆ మూవీస్ను విడుదల చేస్తుంటాడు. తాజాగా అక్షయ్కు సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో హల్చల్ చేస్తుంది. తన అపార్ట్ మెంట్ను హీరో అమ్మేశాడని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
అంధేరి వెస్ట్లో అక్షయ్ కుమార్కు ఓ విలాసవంతమైన ప్రాపర్టీ ఉంది. ఈ అపార్ట్మెంట్ను గతంలో రూ.4.12కోట్లు చెల్లించి అక్షయ్ కొనుగోలు చేశాడు. తాజాగా ఈ అపార్ట్మెంట్ను దబూ మాలిక్ (Daboo Malik) అనే వ్యక్తికి అమ్మేశాడని తెలుస్తోంది. దబూ మాలిక్ ఈ అపార్ట్మెంట్ను రూ.6కోట్లకు కొనుగోలు చేశాడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) తండ్రే దబూ మాలిక్. ఈ అపార్ట్మెంట్ ట్రాన్స్కన్ ట్రయంఫ్ టవర్-1లో ఉంది. దీని విస్తీర్ణం 1281చదరపు అడుగులు ఉంటుందట. బాల్కనీ కూడా 59చదరపు అడుగులతో విశాలంగా ఉంటుందని సమాచారం. ఇరు వర్గాల మధ్య ఒప్పందం ఆగస్టు 12న జరిగినట్టు తెలుస్తోంది. అక్షయ్కు ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర చోట్ల రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయి. ఇక అక్షయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ‘కట్పుత్లీ’ (Cuttputlli) లో చివరగా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కీలక పాత్రలో నటించింది. ‘రామ్ సేతు’ (Ram Setu) షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్గా రూపొందింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ ‘సెల్ఫీ’ లోను నటిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ మరో హీరోగా నటించనున్నాడు.