గర్భస్రావం... అయినా గంటల వ్యవధిలోనే... స్టేజీపై లేడీ సింగర్ పర్ఫామెన్స్...
ABN , First Publish Date - 2021-11-27T17:23:21+05:30 IST
బ్రిటన్కు చెందిన గాయనీ, రచయిత్రి జెస్సీ జే... లాస్ట్ ఏంజిల్స్ నగరంలో తన తాజా పర్ఫామెన్స్తో అభిమానుల్ని ఉర్రూతలూగించింది. అయితే, ఆమె ఇంత త్వరగా వేదిక మీదకి రావటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జెస్సీ కొన్ని గంటల క్రితమే సొషల్ మీడియాలో ఓ బ్యాడ్ న్యూస్ షేర్ చేసింది ఫ్యాన్స్తో...
బ్రిటన్కు చెందిన గాయనీ, రచయిత్రి జెస్సీ జే... లాస్ట్ ఏంజిల్స్ నగరంలో తన తాజా పర్ఫామెన్స్తో అభిమానుల్ని ఉర్రూతలూగించింది. అయితే, ఆమె ఇంత త్వరగా వేదిక మీదకి రావటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జెస్సీ కొన్ని గంటల క్రితమే సొషల్ మీడియాలో ఓ బ్యాడ్ న్యూస్ షేర్ చేసింది ఫ్యాన్స్తో. ఆమె ‘తన స్వంతం’గా బిడ్డని కనాలనుకుందట. కానీ, కొన్ని వారాలుగా గర్భం ధరించిన ఆమె దురదృష్టవశాత్తూ స్రావానికి గురైంది. తన గర్భస్రావం విషాద వార్తని ఆమె ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. జెస్సీ తన బిడ్డ కడుపులోనే మరణించటం పట్ల చాలా ఎమోషనల్ అయింది...
‘‘నేను ‘నా స్వంతం’గా బిడ్డను కనాలనుకున్నాను. అదొక్కటే నా కోరిక. జీవితం చిన్నది కదా’’ అంటూ జెస్సీ ప్రకటించింది. తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరన్నది ఆమె ఇంత వరకూ చెప్పలేదు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా తాజగా గర్భస్రావం జరగటంతో ఆమె ఎంతో కృంగిపోయింది. అయినా జెస్సీ ఒక్క రోజు తేడాలోనే లాస్ ఏంజిల్స్లో వేలాది అభిమానుల ముందు లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. చాలా మంది ఆమె మనో స్థైర్యాన్ని ప్రస్తుతం మెచ్చుకుంటున్నారు...