హీరోయిన్‌గా శిల్పా మంజునాథ్‌ని సెలక్ట్ చేశారు

ABN , First Publish Date - 2021-08-14T02:02:49+05:30 IST

యువ నటుడు నట్టి హీరోగా నూతన దర్శకుడు వీఎం. మునివేలన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేలన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్‌ చెన్నై, పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ చిత్ర హీరోయిన్‌ పేరును

హీరోయిన్‌గా శిల్పా మంజునాథ్‌ని సెలక్ట్ చేశారు

యువ నటుడు నట్టి హీరోగా నూతన దర్శకుడు వీఎం. మునివేలన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేలన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్‌ చెన్నై, పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ చిత్ర హీరోయిన్‌ పేరును ఖరారు చేశారు. గతంలో కాళీ, ఇస్పేట్‌ రాజా ఇదయ రాణి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శిల్పా మంజునాథ్‌ను ఎంపిక చేశారు. అలాగే, చిత్రంలోని ఇతర పాత్రల్లో షీప్‌ నందిని, పార్థా నాయుడు, ప్రదీప్‌ నటిస్తుండగా కార్తీక్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.



Updated Date - 2021-08-14T02:02:49+05:30 IST