డైరెక్టర్ శంకర్ కుమార్తె.. రీసెంట్గా యాక్టరైంది ఇప్పుడు డాక్టరైంది
ABN, First Publish Date - 2021-12-14T04:07:48+05:30
ఇండియన్ సినిమాలో అతిపెద్ద దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఎస్.శంకర్ రెండో కుమార్తె అదితి శంకర్ రీసెంట్గా హీరోయిన్గా కోలీవుడ్ వెండితెరకు పరిచయమై ఇప్పుడు డాక్టర్ కూడా అయ్యింది. తన ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నగరంలోని
ఇండియన్ సినిమాలో అతిపెద్ద దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఎస్.శంకర్ రెండో కుమార్తె అదితి శంకర్ రీసెంట్గా హీరోయిన్గా కోలీవుడ్ వెండితెరకు పరిచయమై ఇప్పుడు డాక్టర్ కూడా అయ్యింది. తన ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నగరంలోని ప్రముఖ డీమ్డ్ యూనివర్శిటీలో వైద్య కోర్సును పూర్తి చేసింది. దీనికి సంబంధించి వర్శిటీ గ్రాడ్యుయేషన్ డే తాజాగా జరిగింది. ఇందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆమె డిగ్రీ పట్టాను అందుకుంది. ఈ కార్యక్రమానికి ఎస్.శంకర్, సతీమణి ఈశ్వరి శంకర్, కుమారుడు అర్జిత్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, డిగ్రీపట్టాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే సాయిపల్లవి, ఐశ్వర్యా లక్ష్మిలు వైద్య కోర్సును పూర్తి చేసి కథానాయికలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, అదితి శంకర్ ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘విరుమన్’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్కు పరిచయమవుతోంది. అదితి శంకర్తో పాటు ప్రముఖ నిర్మాత ఎల్కె. సుధీష్ పెద్ద కుమార్తె జానుశ్రీ సుధీష్ కూడా తన వైద్య కోర్సును ఇదే కాలేజీలో పూర్తి చేసి, డిగ్రీపట్టాను అందుకుంది.