Puneeth Rajkumar తర్వాతి సినిమా ఏ దర్శకుడితోనని ప్రకటించారో.. అతడి పుట్టిన రోజు నాడే ఘోరం..!
ABN , First Publish Date - 2021-10-29T23:39:22+05:30 IST
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్కుమార్ 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. పవర్ స్టార్ పునీత్ కుమార్ జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు.
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్కుమార్ 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. అనంతరం ఆయనను విక్రమ్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.
ఆయన పవన్ కుమార్ అనే దర్శకుడితో సినిమా చేయవలసి ఉంది. ఆ చిత్రానికి ‘‘ ద్విత్వ ’’అనే పేరును కూడా నిర్ణయించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. పవన్ కుమార్తో కలిసి మొదటి సారిగా ఆయన సినిమా చేయబోయే తరుణంలో గుండెపోటుతో మరణించారు. యాదృచ్చికంగా పవన్ కుమార్ పుట్టినరోజు నాడే పునీత్ రాజ్ కుమార్ మరణించారు. దీంతో ఆ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలిపారు.
పవన్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ నేను చాలా సంవత్సరాలుగా ఈ సినిమా స్క్రిప్ట్పై పనిచేస్తున్నాను. ఈ చిత్రంలో పునీత్ను సరికొత్తగా చూపెట్టబోతున్నాను. నేను మొదట కథను రాసుకున్నాక టైటిల్ను వెతకడం మొదలుపెట్టాను. ‘‘ ద్విత్వ’’ అనే టైటిల్ నాకు ఎంతగానో నచ్చింది. దీంతో ఆ టైటిల్ కే ఫిక్సయిపోయాను ’’ అని చెప్పారు.