వేసవిలో ‘పొన్నియిన్ సెల్వన్’
ABN , First Publish Date - 2021-09-21T18:10:38+05:30 IST
ప్రముఖ రచయిత ‘కల్కి’ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. దివంగత ఎంజీఆర్ మొదలుకుని కమల్ హాసన్ వరకు ఈ నవల ఆధారంగా వెండి తెరపై దృశ్యకావ్యా
ప్రముఖ రచయిత ‘కల్కి’ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. దివంగత ఎంజీఆర్ మొదలుకుని కమల్ హాసన్ వరకు ఈ నవల ఆధారంగా వెండి తెరపై దృశ్యకావ్యాన్ని రూపొందించాలని ప్లాన్ చేశారు. కానీ, అది సాధ్యపడలేదు. అయితే, దర్శకదిగ్గజం మణిరత్నంకు ఆ సువర్ణావకాశం లభించింది. ఈ నవల ఆధారంగా సినిమా నిర్మిస్తానని రెండేళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే, కరోనా కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు సెట్స్పైకి వెళ్ళింది. ఇందులో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, జయరాం, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, విక్రమ్ ప్రభు, అశ్విన్, లాల్, నాజర్ వంటి అగ్ర నటీనటులతో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో భారీ సాంకేతికపు నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాయి. ఈ మూవీని దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువభాగం షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం తొలి భాగం షూటింగ్ పూర్తి కాగా, డబ్బింగ్తో పాటు పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుని వచ్చే యేడాది వేసవి సెలవుల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.