బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న మంజువారియర్

ABN , First Publish Date - 2021-11-07T22:07:36+05:30 IST

మాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ మంజువారియర్.. ఇంతకు ముందు ‘అసురన్’ చిత్రంతో కోలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బాలీవుడ్ లో కూడా మంజు హీరోయిన్ గా ఎంటర్ కానున్నారు. సినిమా పేరు ‘అమెరికి పండిట్’. కప్లేష్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్నఈ సినిమాలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న మంజువారియర్

మాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ మంజువారియర్.. ఇంతకు ముందు ‘అసురన్’ చిత్రంతో కోలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బాలీవుడ్ లో కూడా మంజు హీరోయిన్ గా ఎంటర్ కానున్నారు. సినిమా పేరు ‘అమెరికి పండిట్’. కప్లేష్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్నఈ సినిమాలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వినోద ప్రధానమైన ఈ సినిమా షూటింగ్ ఈ మార్చ్ లో భోపాల్ లో ప్రారంభమైంది. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. 



1999తో మలయాళ చిత్రాలకు గుడ్ పై చెప్పేసిన మంజు వారియర్ .. 15 ఏళ్ళ తర్వాత మాలీవుడ్ లో ‘హౌఓల్డ్ ఆర్ యూ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో.. ఆమె వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం మంజు వారియర్ 7 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి మంజుకి ‘అమెరికి పండిట్’ బాలీవుడ్ మూవీ ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2021-11-07T22:07:36+05:30 IST