ధనుష్ 44కి టైటిల్ ఫిక్స్
ABN, First Publish Date - 2021-08-06T13:40:22+05:30
ధనుష్ నటిస్తున్న 44కి చిత్ర బృందం టైటిల్ ఫిక్స్ చేసింది. నేషనల్ అవార్డ్ దక్కించుకున్న కోలీవుడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రాలతో పాటు స్ట్రైట్గా తెలుగు సినిమాను ఇటీవల ప్రకటించాడు.
ధనుష్ నటిస్తున్న 44కి చిత్ర బృందం టైటిల్ ఫిక్స్ చేసింది. నేషనల్ అవార్డ్ దక్కించుకున్న కోలీవుడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రాలతో పాటు స్ట్రైట్గా తెలుగు సినిమాను ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 8 చిత్రాలున్నాయని సమాచారం. వాటిలో తన కెరీర్లో తెరకెక్కుతున్న 44వ చిత్రానికి తాజాగా 'తిరుచిత్రంబలం' అనే టైటిల్ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిథి మారన్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో నిత్యా మీనన్ - రాశి ఖన్నా - ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. మిత్రన్ కె జవహర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ధనుష్ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'మారన్' చేస్తుండగా ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. కాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'యుగానికొక్కడు 2', 'కర్ణన్' ఫేమ్ మారి సెల్వరాజ్తో మరో సినిమా చేయనున్నన్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ కూడా చేయనున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళం హిందీ భాషలలో రూపొందబోతోంది. ఇక ఇప్పటికే హిందీలో 'అత్రాంగి రే', హాలీవుడ్లో 'ది గ్రే మ్యాన్' అనే సినిమాల చిత్రీకరణను పూర్తి చేశాడు.