Dhanush: ఒక్క ఫొటోతో వదంతులకు చెక్
ABN , First Publish Date - 2021-07-13T01:38:04+05:30 IST
ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, దీంతో ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించనున్నారన్నదే ఆ గాసిప్. ఈ వార్త విస్తృతంగా ప్రచారమైంది. ‘జగమే తందిరమ్’ ఇచ్చిన పరాజయం షాక్తో ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్లో గుసగుసలు
హీరో ధనుష్ 43వ చిత్రం సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్లో వస్తోంది. వర్కింగ్ టైటిల్ ‘డి43’తో షూటింగ్ ప్రారంభమైంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రియాంకా మోహనన్తో పాటు అనేకమంది నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమై కొన్ని రోజులపాటు జరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ రెండో దశ ఉధృతి కారణంగా షూటింగ్ను నిలిపివేశారు. అయితే, ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ గత వారం మళ్ళీ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక గాసిప్ కోలీవుడ్లో చక్కర్లు కొట్టింది. చిత్ర దర్శకుడు కార్తీక్ నరేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, దీంతో ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించనున్నారన్నదే ఆ గాసిప్. ఈ వార్త విస్తృతంగా ప్రచారమైంది. ‘జగమే తందిరమ్’ ఇచ్చిన పరాజయం షాక్తో ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి.
అయితే, ఈ వదంతులన్నింటికీ చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ తాజాగా చెక్పెట్టింది. ఇందుకోసం కేవలం ఒకే ఒక ఫొటోను మాత్రమే రిలీజ్ చేసింది. దీంతో ఈ డీ43పై సాగుతున్న అన్ని రకాల వదంతులకు ఫుల్స్టాప్ పడింది. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ సమయంలో హీరో ధనుష్కు దర్శకుడు కార్తీక్ నరేన్ సూచనలిస్తుండగా, వాటిని హీరో ఆసక్తిగా వింటున్నట్టుగా ఈ ఫొటో ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు తప్పుకున్నారనే ప్రచారానికి తెరపడింది.