ఎస్పీబీకి ‘అణ్ణాత్త’ బృందం నివాళి.. 25న టైటిల్ సాంగ్ రిలీజ్
ABN , First Publish Date - 2021-09-18T18:59:09+05:30 IST
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘అణ్ణాత్త’. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతోంది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘అణ్ణాత్త’. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతం డి.ఇమ్మాన్. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఇప్పటికే రిలీజ్ చేయగా, దానికి రజనీ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ‘అణ్ణాత్త’ ఫస్ట్లుక్ బ్యానర్కు మేకపోతు తల నరికి రక్తాభిషేకం చేశారు. దీనిపై జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే, ఈ చిత్రంలోని పాటల్లో ఓపెనింగ్ సింగిల్ను ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను గానగంధర్వుడు దివంగత ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాడారు. అందుకే ఎస్పీబీ వర్థంతి రోజైన సెప్టెంబరు 25న ఆయనకు నివాళులర్పించేలా ఈ పాటను విడుదల చేయనున్నారు.