MAA: బ్యాలెట్ పేపర్లలో ఎవరెవరు ఎక్కడున్నారంటే?
ABN , First Publish Date - 2021-10-10T00:52:58+05:30 IST
‘మా’ ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభమై మథ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత వచ్చే వారికి
‘మా’ ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభమై మథ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని, ఆలోపు పోలింగ్ కేంద్రంలోకి ఎంటరైన వారందరూ ఓట్లు వినియోగించుకునేందుకు వీలుంటుందని ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ వివరాలను కూడా విడుదల చేశారు. ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఈ బ్యాలెట్ పేపర్స్ ఎలా ఉంటాయో? ఇందులో ఎవరెవరు ఎక్కడున్నారో తెలిసేలా.. నెంబర్లు, ఫొటోలతో సహా ముద్రించారు. ఓటర్లు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో.. వారికి ఎదురుగా స్టాంప్ వేసేలా బాక్స్లను కేటాయించారు. బ్యాలెట్ పేపర్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఓసారి లుక్కేయండి.