కత్రినా పెళ్లికి వెంకీ..?
ABN, First Publish Date - 2021-12-07T16:07:29+05:30
విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ జంట వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈనెల రాజాస్థాన్లో కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు.
విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ జంట వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈనెల రాజాస్థాన్లో కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి ముఖ్యమైన వారిని మాత్రమే విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ ఆహ్వానించినట్లు సమాచారం. వీద్దరికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిని మాత్రమే ఆహ్వానించారట. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వెంకటేశ్తో కత్రినా 'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్గా నటించింది. అంతేకాదు తన మొదటి తెలుగు సినిమా కూడా. ఇక కత్రినాకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో వెంకీ కూడా ఉన్నారట. అందుకే ప్రత్యేకంగా ఆయనకు స్పెషల్ ఇన్విటేషన్ అందినట్టు తెలుస్తోంది.