‘యశోద’ లో కోలీవుడ్ విలక్షణ నటీమణి ?
ABN, First Publish Date - 2021-12-09T18:42:33+05:30
టాలీవుడ్ అందాల అగ్రతార సమంత.. చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ పౌరాణిక చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయ్యారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో హరి, హరీశ్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘యశోద’ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఆసక్తికరమైన కథనాలతో రూపొందనున్న ఈ సినిమాలోని తన పాత్ర సామ్ ను ఎంతో థ్రిల్ చేసిందట.
టాలీవుడ్ అందాల అగ్రతార సమంత.. చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ పౌరాణిక చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయ్యారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో హరి, హరీశ్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘యశోద’ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఆసక్తికరమైన కథనాలతో రూపొందనున్న ఈ సినిమాలోని తన పాత్ర సామ్ ను ఎంతో థ్రిల్ చేసిందట. అందుకే వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
హీరో క్యారక్టర్ అనేదే ఈ సినిమాలో లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో హీరో, హీరోయిన్ రెండూ సమంతనే అని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇందులో ఒక ముఖ్యపాత్ర కోసం కోలీవుడ్ విలక్షణ నటీమణి వరలక్ష్మి శరత్ కుమార్ ను సంప్రదించారట మేకర్స్. తన పాత్ర చాలా వెరైటీగా ఉండడంతో ఇందులో నటించడానికి తన అంగీకారం తెలిపిందట వరూ. వరలక్ష్మీ శరత్ కుమార్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజుంది. అలాగే.. మలయాళ ప్రేక్షకులకూ ఆమె సుపరిచితురాలు. అందుకే యశోద చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం విడుదల చేస్తారట. మరి ‘యశోద’ చిత్రానికి వరలక్ష్మి ఎంపిక ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.