రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్?

ABN , First Publish Date - 2021-09-21T22:04:29+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకోవడంలోనూ, విభిన్న పాత్రలు పోషించడంలోనూ ఆయనెప్పుడూ ముందు వరుసలో ఉంటారు. గత కొంతకాలంగా.. సరైన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్న ఈ హీరో చివరగా ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు.

రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్?

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకోవడంలోనూ, విభిన్న పాత్రలు పోషించడంలోనూ ఆయనెప్పుడూ ముందు వరుసలో ఉంటారు. గత కొంతకాలంగా..  సరైన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్న ఈ హీరో  చివరగా  ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహాసముద్రం’ సినిమాని రిలీజ్ కు రెడీ చేయగా..  కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే ఫ్యామిలీ మూవీలో కూడా నటిస్తున్నారు. ఇక దీని తర్వాత శర్వానంద్ ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం దర్వకత్వంలో శర్వా తన తదుపరి చిత్రాన్ని సెట్ చేసుకున్నారట.


చాలా రోజుల నుంచి  ‘రాజు సుందరం’ తెలుగులో ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని  చూస్తున్నారు. గతంలో ఎప్పుడో ఏగన్ అనే మూవీతో తొలిసారిగా మెగా ఫోన్ పట్టారు రాజు సుందరం. ఇప్పుడు మరోసారి శర్వా హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతుండడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కు వక్కంతం వంశీ కథ, స్ర్కీన్ ప్లే అందిస్తుండడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. ఈ కథకి శర్వానంద్ ఓకే చెప్పినట్టు వినికిడి. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. 


Updated Date - 2021-09-21T22:04:29+05:30 IST