Prabhas - Radhe Shyam: నిజ ఘటనలతో ప్రభాస్ ‘రాధేశ్యామ్’.. కథ అదేనా?
ABN, First Publish Date - 2021-07-27T18:28:26+05:30
హీరో ప్రభాస్ ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ముందుగా ‘రాధేశ్యామ్’ విడుదలవుతుంది. కాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే..
హీరో ప్రభాస్ ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ముందుగా ‘రాధేశ్యామ్’ విడుదలవుతుంది.ఈ సినిమాలో యూరప్ బ్యాక్డ్రాప్తో సాగే ప్రేమకథ కూడా ఉంటుంది. ఈ విషయం గ్లింప్స్ ద్వారా రివీల్ అయ్యింది. కాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం యూరప్లో ఓ ట్రెయిన్ మిస్ అయ్యింది.. దాని గురించి అధికారులు వెతికినా జాడ కనిపెట్టలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఆ ట్రెయిన్ మళ్లీ మెక్సికోలో ప్రత్యక్షమైంది. అసలు ఆ ట్రెయిన్ మెక్సికోకు ఎలా వెళ్లిందనేది ఎవరికీ అంతు బట్టని విషయంగా మారింది. ఈ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్... ‘రాధేశ్యామ్’ కథను రాసుకున్నాడట.
‘రాధేశ్యామ్’ సినిమాలోనూ ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణిస్తున్న రైలు ఓ గుహలోకి వెళ్లగానే మాయమైపోయి.. వారిని 1970 బ్యాక్డ్రాప్లోకి తీసుకెళుతుంది. అక్కడ వారి మధ్య పుట్టే ప్రేమ.. ఇతర విషయాలతో సినిమా పీరియాడికల్ స్టైల్లో ఉంటుందని టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా విడుదలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.