సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్టార్ హీరోతో జోడీ కట్టనున్న వాణీ భోజన్

ABN, First Publish Date - 2021-02-21T23:42:24+05:30

‘ఓ మై కడువులే’, ’లాకప్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ వాణీ భోజన్‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌నుంది ఈ సొగ‌స‌రి. ఇంత‌కీ వాణీ భోజ‌న్ జోడీ క‌ట్ట‌బోతున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. చియాన్ విక్ర‌మ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఓ మై కడువులే’, ’లాకప్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ వాణీ భోజన్‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌నుంది ఈ సొగ‌స‌రి. ఇంత‌కీ వాణీ భోజ‌న్ జోడీ క‌ట్ట‌బోతున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. చియాన్ విక్ర‌మ్‌. ఇప్పుడు రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ, హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కించనున్న మరో చిత్రంలో నటించేందుకు వాణీ భోజన్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో చియాన్‌ విక్రమ్‌ సరసన నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చేసిందీ ముద్దుగుమ్మ. కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ  చిత్రంలో విక్రమ్‌, ఆయన కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ కలిసి నటించనున్నారు. ఇందులో విక్రమ్‌ సరసన నటించేందుకు వాణీ భోజన్‌ను ఎంపిక చేశారు. ధృవ్‌ విక్రమ్‌ కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మూవీ పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇదిలావుంటే విక్రమ్‌ ప్రస్తుతం ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 

Updated Date - 2021-02-21T23:42:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!