నిశ్చితార్థం ముగిసింది.. ఈసారైనా పెళ్లిపీటలు ఎక్కుతుందా?
ABN , First Publish Date - 2021-08-12T18:37:22+05:30 IST
కోలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ ప్రేమ జంట నయనతార - విఘ్నేష్ శివన్ ఇటీవల కాలంలో ప్రైవేట్ జెట్ విమానాల్లో చెన్నై టు కొచ్చిన్కు చక్కర్లు కొడుతున్నారు. ఈ జంట నిర్మాణ సంస్థను సైతం స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం నయనతార 'అన్నాత్త', 'నెట్రికణ్' నటించింది.
కోలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ ప్రేమ జంట నయనతార - విఘ్నేష్ శివన్ ఇటీవల కాలంలో ప్రైవేట్ జెట్ విమానాల్లో చెన్నై టు కొచ్చిన్కు చక్కర్లు కొడుతున్నారు. ఈ జంట నిర్మాణ సంస్థను సైతం స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం నయనతార 'అన్నాత్త', 'నెట్రికణ్' చిత్రాల్లో నటించింది. వీటిలో 'నెట్రికణ్' చిత్రం హాట్స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. వాస్తవానికి తాను నటించే చిత్రాల ప్రమోషన్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలనే కాకుండా మీడియాకు సైతం ఆమె దూరంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి, అందులో తన ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పింది. అంతేకాకుండా, విఘ్నేష్ శివన్తో పెళ్ళి నిశ్చితార్థం కూడా ముగిసినట్టు వెల్లడించింది. కాగా, 'నానుమ్ రౌడీ దాన్' అనే చిత్రం నుంచి వీరిద్దరూ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంటిలో ఉంటున్నారు. మరి ఇప్పుడు నిశ్చితార్థం కూడా పూర్తయిందని నయన్ చెబుతుంది. అంతకుముందు కూడా ప్రభుదేవాతో దాదాపు ఈ స్టేజ్ వరకు వెళ్లి నయన్ భంగపడింది. ఈసారైనా ఆమె పెళ్లిపీటలు ఎక్కుతుందేమో చూద్దాం.