మళ్లీ మెగా కాంపౌండ్ లోకి దిశాపటానీ?

ABN , First Publish Date - 2021-12-27T15:24:51+05:30 IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ సినిమాగా విశేషాన్ని సంతరించుకుంది. ఇంతవరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ నెల జూన్ కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా ‘ఇండియన్ 2’ చిత్రానికి లైన్ క్లియర్ అవడంతో శంకర్ అటు వెళ్ళాల్సి వచ్చింది. 6 నెలల పాటు శంకర్ అందుబాటులో ఉండడు.

మళ్లీ మెగా కాంపౌండ్ లోకి దిశాపటానీ?

మెగాపవర్ స్టార్ రామ్  చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ సినిమాగా విశేషాన్ని సంతరించుకుంది. ఇంతవరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి..  దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా ‘ఇండియన్ 2’ చిత్రానికి లైన్ క్లియర్ అవడంతో శంకర్ అటు వెళ్ళాల్సి వచ్చింది. 6 నెలల పాటు శంకర్ అందుబాటులో ఉండడు. ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి సినిమాను లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. త్వరలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళి శంకర్ వచ్చేలోపు షూటింగ్ కంప్లీట్ చేయాలన్నది చరణ్ ప్లాన్. 


ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించాడని టాక్.  ఇందులో కథానాయికగా ఇంతవరకూ ఎవరినీ అనుకోలేదు. అయితే దిశాపటానీ ని ఎంపిక చేయాలని గౌతమ్ అనుకుంటున్నాడట. దాదాపు ఆమెనే ఖాయం చేయొచ్చని తెలుస్తోంది. దిశా పటానీ.. వరుణ్ తేజ్, పూరీ చిత్రం ‘లోఫర్’ తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రి ఇచ్చింది. సినిమా అంతగా అలరించలేకపోయినా.. దిశా గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ కెళ్ళి .. అక్కడ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఇంతకాలానికి రామ్ చరణ్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో కథానాయికగా నటించడనుండడం ఆసక్తిని రేపుతోంది. మరి ఈ సారి దిశ దశ ఎలా ఉంటుందో చూడాలి. 

Updated Date - 2021-12-27T15:24:51+05:30 IST