చరణ్ 15 ఓపెనింగ్కి గెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో..?
ABN, First Publish Date - 2021-09-04T13:33:09+05:30
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా భారీ బడ్జెట్తో రూపొందనున్న దీని ఓపెనింగ్కి గెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో విచ్చేయనున్నట్టు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా భారీ బడ్జెట్తో రూపొందనున్న దీని ఓపెనింగ్కి గెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో విచ్చేయనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్తో కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. ఈ మూవీని సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దర్శకుడు శంకర్.. చరణ్ 15 లాంచింగ్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ని దించబోతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో కన్ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది. శంకర్ - రణ్వీర్ కాంబినేషన్లో 'అపరిచితుడు' హిందీ రీమేక్ రూపొందనుంది.