యండమూరి కథ... వర్మ దర్శకత్వం
ABN, First Publish Date - 2021-11-27T09:03:44+05:30
యండమూరి రచనలలో ‘తులసి దళం’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు పాఠకులకు హారర్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించిన నవల అది...
యండమూరి రచనలలో ‘తులసి దళం’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు పాఠకులకు హారర్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించిన నవల అది. ఇప్పుడు ఈ నవలకు సీక్వెల్గా ‘తులసి తీర్థం’ వచ్చింది. ఇది సినిమాగా రాబోతోంది. రాంగోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించనున్నారు. ఇటీవల హైదరాబాద్లో పోస్టర్ని ఆవిష్కరించారు. ‘‘అరుదైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. గ్రాఫిక్స్కి అధిక ప్రాధాన్యం ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతామ’’ని నిర్మాత తెలిపారు.