రెండు వేలమంది అఘోరాలతో...
ABN , First Publish Date - 2021-12-23T05:35:46+05:30 IST
కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పి.శర్మ, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రచీర’ చిత్రం ఫూటింగ్ పూర్తయింది. రెండు వేలమంది అఘోరాలతో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు...

కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పి.శర్మ, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రచీర’ చిత్రం ఫూటింగ్ పూర్తయింది. రెండు వేలమంది అఘోరాలతో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇవి సినిమాకే హైలైట్గా నిలుస్తాయని దర్శకుడు సుమన్బాబు చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ, ‘అఖండ’ చిత్రానికి గ్రాఫిక్స్ అందించిన మాట్రిక్స్ సంస్థ ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ వర్క్ చేస్తోందని, సినిమాలో 30 నిముషాల గ్రాఫిక్స్ కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. సీజీ వర్క్ ఆలస్యం కావడం వల్లే చిత్రం విడుదలలో జాప్యం జరిగిందని సుమన్బాబు చెప్పారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శివరాత్రికి ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.