వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా కొత్త చిత్రం ప్రారంభం..!
ABN, First Publish Date - 2021-04-02T19:17:14+05:30
'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. మొదటి సినిమాతోనే ఇంతటి అఖండ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా 'ఉప్పెన' రిలీజ్ కాకుండానే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రెండవ సినిమాని కంప్లీట్ చేశాడు.
'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. మొదటి సినిమాతోనే ఇంతటి అఖండ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా 'ఉప్పెన' రిలీజ్ కాకుండానే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రెండవ సినిమాని కంప్లీట్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమయింది. 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్కి పరిచయమయిన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బాపినీడు సమర్పణలో...సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకీ 'అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ఈ సినిమాలోని ఇతర నటీ నటులను త్వరలో ప్రకటించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నారు.