ఐశ్వర్య దర్శకత్వంలో తెలుగు సినిమా
ABN , First Publish Date - 2021-10-04T07:32:01+05:30 IST
తెలుగు చిత్ర పరిశ్రమకు రజనీకాంత్ పెద్ద కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సుభాస్కరన్, మహవీర్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు...

తెలుగు చిత్ర పరిశ్రమకు రజనీకాంత్ పెద్ద కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సుభాస్కరన్, మహవీర్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్, శ్రుతీ హాసన్ నటించిన ‘3’ చిత్రంతో ఐశ్వర్య దర్శకురాలిగా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగులోనూ ఆ సినిమా అనువాదమైంది. తమిళంలోనే దర్శకురాలిగా రెండో సినిమా తీశారు. ఆరేళ్ల తర్వాత తెలుగులో మూడో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఐశ్వర్యా ఆర్. ధనుష్ మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. ‘‘ఐశ్వర్య తన స్ట్రయిట్ తెలుగు సినిమాను మా సంస్థలో చేస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది’’ అని లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ అన్నారు. ఈ చిత్రానికి సంజీవ్ రచయిత.