‘మరో ప్రస్థానం’ సెన్సార్ పూర్తి.. రిలీజ్కు రెడీ
ABN, First Publish Date - 2021-09-15T02:56:01+05:30
యువ హీరో తనీష్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మరో ప్రస్థానం’. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర మొదలగువారు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని
యువ హీరో తనీష్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మరో ప్రస్థానం’. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర మొదలగువారు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ని పొందింది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ.. ‘మరో ప్రస్థానం’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా చూసిన సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా.. వన్ షాట్ ఫిల్మ్గా ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని అభినందించారు. సినిమా బాగుందంటూ వాళ్లు చెప్పడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసేలా ఉంటుంది. సినిమా చూసే వాళ్లను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందిది. సింగిల్ షాట్ ప్యాటర్న్లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్లోని ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు.