ప్రముఖ నిర్మాత బాలు కన్నుమూత
ABN, First Publish Date - 2021-01-02T21:11:59+05:30
ప్రముఖ నిర్మాత బాలు కన్నుమూత
చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కె బాలు కన్నుమూశారు. కేపీ ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ప్రభు, కుష్బూ హీరోహీరోయిన్లుగా ‘చిన్నతంబి’ సినిమాను తెరకెక్కించారు. బాలు మృతి విషయాన్ని సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్ శరత్కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిజేశారు. బాలు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన చాలా త్వరగా వెళ్లిపోయారని, బాలు లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. బాలు కుటుంబం, స్నేహితులు, సినీ రంగంలోని ఆయన సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తిని కోల్పోయామని దర్శక నిర్మాత వెంకట్ ప్రభు పేర్కొన్నారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ రోజు బాలు మృతి విషయం తెలిసి షాక్కు గురైనట్టు జాతీయ అవార్డు పొందిన నిర్మాత జి ధనంజయన్ పేర్కొన్నారు.