మహేశ్కు సర్జరీ..'సర్కారు వారి పాట'కు బ్రేక్..?
ABN , First Publish Date - 2021-12-02T16:01:05+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల 'సర్కారు వారి పాట' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్కు బ్రేక్ పడనుందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల 'సర్కారు వారి పాట' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్కు బ్రేక్ పడనుందని తెలుస్తోంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుందట. అయితే, మహేశ్కు ఇంతకముందునుంచే మోకాలికి సంబంధించి ఓ సమస్య ఉందట. అది ఇప్పుడు తీవ్రమవడంతో తప్పని పరిస్థితుల్లో సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారట. దీని కోసమే మహేశ్ బ్రేక్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది కాబట్టే మహేశ్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ సర్జరీ తర్వాత రెండు నెలల పాటు మహేశ్ రెస్ట్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే మళ్ళీ 'సర్కారు వారి పాట' బ్యాలెన్స్ షూట్ను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించగా, ఆ సమయానికే వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.