క్రిస్మస్కు శ్యామ్సింగరాయ్
ABN , First Publish Date - 2021-10-19T06:33:08+05:30 IST
నాని కథానాయకుడిగా పాతతరం కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు....

నాని కథానాయకుడిగా పాతతరం కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చే స్తున్నట్టు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నాని, సాయిపల్లవిపై పోస్టర్ను విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నానీ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమటం కీలకపాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సానుజాన్ వర్గీస్.