సాయితేజ్‌ ట్వీట్‌.. ఆనందంలో అభిమానులు

ABN , First Publish Date - 2021-10-04T04:38:21+05:30 IST

గత నెల పదో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ మెల్లగా కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు తీపి కబురు చెప్పారు.

సాయితేజ్‌ ట్వీట్‌.. ఆనందంలో అభిమానులు

గత నెల పదో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ మెల్లగా కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు తీపి కబురు చెప్పారు. ట్విటర్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ ‘‘మీరు నాపై, ‘రిపబ్లిక్‌’ సినిమాపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతలు. ఈ మాట చాలా చిన్నది అవుతుంది.  త్వరలోనే అందరి ముందుకు వస్తాను’’ అని ట్వీట్‌ చేశారు. సాయితేజ్‌ హీరోగా నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది. ఇందులో తేజ్‌ కలెక్టర్‌గా నటించి మెప్పించారు. 




Updated Date - 2021-10-04T04:38:21+05:30 IST