రష్మిక.. అప్పుడలా... ఇప్పుడిలా.. ఇదెలా?
ABN, First Publish Date - 2021-11-29T01:56:24+05:30
‘ఛలో’ సినిమాతో తెలుగుతెరకు పరిచమయ్యారు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని తెలుగులో అగ్రతారగా ఎదిగారు. ఇప్పటి వరకూ ఆమె పోషించిన పాత్రల్లో పక్కింటి అమ్మాయి పాత్రలే ఎక్కువ. గ్లామర్, ఎక్స్పోజింగ్ రోల్స్ చేసిందీ తక్కువే! ఆమె కాస్త స్కిన్ షో చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ కోసం. ఫస్ట్ టైమ్ ఆ పాట కోసం అందాలను ఆరబోసింది.
‘ఛలో’ సినిమాతో తెలుగుతెరకు పరిచమయ్యారు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని తెలుగులో అగ్రతారగా ఎదిగారు. ఇప్పటి వరకూ ఆమె పోషించిన పాత్రల్లో పక్కింటి అమ్మాయి పాత్రలే ఎక్కువ. గ్లామర్, ఎక్స్పోజింగ్ రోల్స్ చేసిందీ తక్కువే! ఆమె కాస్త స్కిన్ షో చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ కోసం. ఫస్ట్ టైమ్ ఆ పాట కోసం అందాలను ఆరబోసింది. మాస్గా డాన్స్లు చేసింది. ఇదే విషయం ఆమెను అడిగితే ‘‘మైండ్ బ్లాక్’ పాట డిమాండ్ మేరకు అలా చేశాను. ఆ పాటను తెరపై చూసుకున్నాక ‘నేనేనా ఇంత మాస్గా చేసింది అని అనిపించింది. మళ్లీ తరహా పాట చేయకపోవచ్చు’’ అని చెప్పింది రష్మిక. అయితే తాజాగా మరోసారి తన అందాలను ఆరబోసింది రష్మిక మందన్నా. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఆమె శ్రీవల్లి పాత్ర పోషిస్తోంది. పూర్తిగా డీగ్లామర్ పాత్ర అది. అందులో ‘సామి సామి’ సాంగ్లో ఊర మాస్ డాన్స్లు చేయడమే కాకుండా ఎక్స్పోజింగ్ డోస్ కూడా పెంచింది. డీగ్లామర్ పాత్రలో రష్మిక అదరగొట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ‘సరిలేరు నీకెవ్వరు’ పాట విషయంలో ఇంకోసారి అలాంటి మాస్ డాన్స్ చేయనని చెప్పిన రష్మిక ఇప్పుడు ఊర మాస్గా ఎలా కనిపించింది? అని నెటిజన్లు అడుగుతున్నారు. దీనికి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.