‘ఉప్పెన’కు రామలక్ష్మి సినీ క్రియేషన్స్ అభినందన సభ

ABN , First Publish Date - 2021-02-15T22:30:15+05:30 IST

వేలంటైన్స్ డే సందర్భంగా ఆదివారం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'కొత్తకా రెక్కలొచ్చెనా' సినిమా లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'ఉప్పెన' చిత్ర యూనిట్ చేతుల

‘ఉప్పెన’కు రామలక్ష్మి సినీ క్రియేషన్స్ అభినందన సభ

వేలంటైన్స్ డే సందర్భంగా ఆదివారం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'కొత్తకా రెక్కలొచ్చెనా' సినిమా లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'ఉప్పెన' చిత్ర యూనిట్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. స్టైల్ సినిమాలోని 'తెలుగోడి స్టైలే దుమ్ములేపే స్టైలే' డైలాగ్ వీరికి కరెక్టు యాప్ట్ అవుతుందని అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్‌. 'ఉప్పెన' సక్సెస్‌ సందర్భంగా చిత్రయూనిట్‌ను ఆయన అభినందించారు.


ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ''కోవిడ్ టైమ్‌లో అందరం ఎన్నో ఇబ్బందులను ఫేస్‌ చేశాం. కోవిడ్ తర్వాత అందరికీ కొత్త రెక్కలు వచ్చినట్లు, న్యూ లైఫ్ బిగిన్ అయినట్లు భావిస్తున్నారు. అలాగే ఈ  సినిమా 'కొత్తగా రెక్కలొచ్చెనా' సినిమా ప్రజెంట్ జనరేషన్ ఆఫ్టర్ 80 తర్వాత ఉన్న జనరేషన్‌కు ఉన్న ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఈ మూవీ చేయడం జరిగింది. అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. 'కొత్తగా రెక్కలొచ్చెనా' లోగోను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు, నిర్మాత నవీన్‌లు లాంచ్ చేయడం, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ... బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఉప్పెన సినిమాకు మేము అభిననంద సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన  ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.


చిరంజీవిగారు, సుకుమార్‌గారు చెప్పినట్లు 'ఈ సినిమా అందరి అంచనాలు మించి ఉంటుంది'.. వారన్న వాక్యాలు అక్షర సత్యాలు అవ్వడమేకాక వారి మాటలకు ఇంకా వేల్యూ పెరిగింది. ఇందులో నటించిన నటీనటులందరూ కొత్తవారే అయినా అన్ని విభాగాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చిత్ర నిర్మాత నవీన్‌గారు తెలుగువాడైనా అమెరికాలో ఉండి వచ్చి సినిమాపై వున్న ఫ్యాషన్‌తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ను స్థాపించి మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఒక శ్యాంప్రసాద్రెడ్డి, ఎమ్మెస్ రాజు, లేట్ రామానాయుడు, దిల్ రాజుల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ . వీరందరూ బాలీవుడ్, హాలీవుడ్ వారు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా మన తెలుగు సినిమాను ఒక రేంజ్‌కి తీసుకెళ్లారు. ఈ మధ్య మన తెలుగు సినిమాలు తెలుగోడి దమ్ము ఏంటో చూపిస్తున్నాయి. వీళ్లను చూస్తుంటే నేను తీసిన  స్టైల్ సినిమాలోని 'తెలుగోడి స్టైలే దుమ్ములేపే స్టైలే..' డైలాగ్ వీరికి కరెక్టు యాప్ట్ అనిపిస్తుంది.


బుచ్చిబాబు సుకుమార్‌గారికి ఉప్పెన రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చి గురువుని మించిన శిష్యుడు అని పించుకున్నారు. దర్శకుడు రస్టిక్ స్టోరీతో  మేకప్ లేకుండా ఈ కథను ఎంచుకొని అద్భుతమైన సినిమా తీశారు. హీరో మేకప్ లేకుండా న్యాచురల్‌గా నటించి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించాడు. హీరోయిన్ ఎమోషన్స్ ఫర్ఫార్మెన్స్ చూస్తుంటే మరో దీపికా పదుకొనే వచ్చినట్లు ఉంది. ప్రేమ పేరుతో వచ్చిన ఎన్నో సినిమాల క్లైమాక్స్ శాడ్‌ ఎండింగ్‌తో ముగిశాయి. కానీ ఈ సినిమా క్లైమాక్స్.. ప్రేక్షకులకు రియల్ లైఫ్‌లో ప్రేమపై మరింత గౌరవం పెంచేలా చేసింది. 


థియేటర్లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల క్లైమాక్స్ సీన్స్‌లకు ప్రేక్షకులు ఎలా రెస్పాన్స్ అవుతారో.. ఈ మూవీలోని క్లైమాక్స్‌కు అంత రెస్పాన్స్ కావడం గొప్ప విశేషం. ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి పాన్ ఇండియా ఫిల్మ్ అయ్యేలా చేశారు. ఇంత పెద్ద హిట్ అయిన సినిమాకు మా 'కొత్తగా రెక్కలొచ్చెనా' టీం తరుపున అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.." అని అన్నారు.

Updated Date - 2021-02-15T22:30:15+05:30 IST