‘అంత:పురం’లో రాశీ ఖన్నా‌ ఎందుకు భయపడుతోంది?

ABN , First Publish Date - 2021-12-30T00:10:50+05:30 IST

ఇప్పటి వరకు ‘అంత:పురం’ అనగానే అందరికీ కృష్ణవంశీ దర్శకత్వంలో సౌందర్య నటించిన చిత్రం గుర్తొస్తుంది. ఇకపై ‘అంత:పురం’ అనగానే రాశీ ఖన్నా నటించిన చిత్రం గుర్తొస్తుంది అంటున్నారు గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మేకర్స్. వివరాల్లోకి వెళితే..

‘అంత:పురం’లో రాశీ ఖన్నా‌ ఎందుకు భయపడుతోంది?

ఇప్పటి వరకు ‘అంత:పురం’ అనగానే అందరికీ కృష్ణవంశీ దర్శకత్వంలో సౌందర్య నటించిన చిత్రం గుర్తొస్తుంది. ఇకపై ‘అంత:పురం’ అనగానే రాశీ ఖన్నా నటించిన చిత్రం గుర్తొస్తుంది అంటున్నారు గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మేకర్స్. వివరాల్లోకి వెళితే.. అనగనగా ఓ ‘అంతఃపురం’. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. సకల సౌకర్యాలు ఉన్నాయి.. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదలకానున్న ‘అంతఃపురం’ సినిమా చూడాల్సిందే. రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా ‘అరణ్మణై 3’. సుందర్. సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం హారర్ కామెడీగా తెరకెక్కి, తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మేకర్స్ విడుదల చేస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్, ఖుష్బూ సమర్పణలో.. అవని సినీమాక్స్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది. 


చిత్ర తెలుగులో విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సుందర్. సి మాట్లాడుతూ.. ‘‘మా ‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’ పేర్లతో విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడీ ‘అంతఃపురం’ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా. ‘అంతఃపురం’లో‌ గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-30T00:10:50+05:30 IST