Pawan and Trivikram : సాయిధరమ్ తేజ్ కి అభినందనలు
ABN , First Publish Date - 2021-10-04T13:54:54+05:30 IST
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ .. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్ననే ఆయన.. తను కోలుకుంటున్నట్టు థంబ్ సింబల్ తో ట్వీట్ చేసి... అభిమానులకి ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ .. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్ననే ఆయన.. తను కోలుకుంటున్నట్టు థంబ్ సింబల్ తో ట్వీట్ చేసి... అభిమానులకి ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న బైక్ యాక్సిడెంట్ లో గాయాలపాలైన సాయి ధరమ్.. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసుపత్రిలో ఉన్న సాయిని కలిసి ‘రిపబ్లిక్’ లోని ఆయన నటనకి, సినిమా సక్సెస్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి ఫ్లవర్ బొకే అందించారు. రీసెంట్ గా విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. అందులోని సాయిధరమ్ పెర్ఫార్మెన్స్ కు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ‘రిపబ్లిక్’ టీమ్ కు అభినందనలు తెలిపారు. దర్శకుడు దేవ్ కట్టా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.