ఆ పాటలానే ‘శశి’ పెద్ద హిట్ అవ్వాలి: సాయికుమార్
ABN , First Publish Date - 2021-02-02T02:53:20+05:30 IST
లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్, అందాల భామ సురభి హీరోహీరోయిన్లుగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు

లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్, అందాల భామ సురభి హీరోహీరోయిన్లుగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శశి'. ఇటీవల ఈ చిత్రం టీజర్ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్తో పాటు చిత్రం నుంచి విడుదలైన 'ఒకే ఒక లోకం నువ్వే' మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తూ.. ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది ఈ పాటను రింగ్ టోన్స్ గా ఉపయోగిస్తున్నారు. అంతలా రీచ్ అయి 21మిలియన్స్ దాటి హల్చల్ చేస్తోంది. యువ సంగీత కెరటం అరుణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన "ఒకే ఒక లోకం నువ్వే" పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. పాట బ్రహ్మాండమైన విజయం సాధించిన సందర్భంగా "ఒకే ఒక లోకం" పాట సక్సెస్ సెలబ్రేషన్స్ను చిత్రయూనిట్ ఫిబ్రవరి 1న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్తో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ మాట్లాడుతూ.. "ఒకే ఒక లోకం నువ్వే పాట 21 మిలియన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్తోంది. చంద్రబోస్ గారి రచన, అరుణ్ అద్భుతమైన ట్యూన్, సిద్ శ్రీరామ్ గాత్రం ఈ పాట సక్సెస్ కి మెయిన్ కారణం. సంగీతం, సాహిత్యం బాగా కుదిరింది కాబట్టే పెద్ద హిట్ అయింది. పాట ఎంత హిట్ అయిందో సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల మాట్లాడుతూ.. "ఒకే ఒక లోకం నువ్వే పాట 21మిలియన్స్ వ్యూస్ పైగా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతలా ఆదరిస్తున్న మ్యూజిక్ లవర్స్, ప్రేక్షకులకు నా థాంక్స్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా అరుణ్, చంద్రబోస్ గారికే దక్కుతుంది. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది." అన్నారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. "నిర్మాత వర్మ నాకు ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్.. బేసిగ్గా అతను డిస్ట్రిబ్యూటర్. మంచి కథతో ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు. రీసెంట్ గా నేను 'పోలీస్ స్టోరీ' 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ "ఒకే ఒక లోకం నువ్వే" పాటని కన్నడలో తర్జుమా చేసి బాగా ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అలాగే తమిళనాడులో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా 'శశి' పాట లాగే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ ఫోన్స్ చేసి చెపుతున్నారు. అరుణ్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్ రాశారు. ఆది కేరియర్ బెస్ట్ సాంగ్ ఇది. 21 మిలియన్స్ పైగా రీచ్ అయింది. నేను చాలా ఎగ్జైట్ గా వున్నాను. పాట కన్నా 'శశి' పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం." అన్నారు.