‘ఓ బేబీ!’ తర్వాత ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ కోసం మరోసారి!

ABN , First Publish Date - 2021-07-26T22:11:03+05:30 IST

‘ఓ బేబీ!’ చిత్రాన్ని నిర్మించిన సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ మరో చిత్రం కోసం మళ్లీ అసోసియేట్‌ అయ్యారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి

‘ఓ బేబీ!’ తర్వాత ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ కోసం మరోసారి!

‘ఓ బేబీ!’ చిత్రాన్ని నిర్మించిన సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ మరో చిత్రం కోసం మళ్లీ అసోసియేట్‌ అయ్యారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్‌ స్టంట్స్‌ చేయబోతున్నారు.



ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ మొదలైంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ షూటింగ్‌ పున:ప్రారంభించాము. ప్రస్తుతం ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్ట్ ఎండింగ్‌కి చిత్రం పూర్తవుతుంది. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్‌గ్రానీ’ చిత్రం మాదిరిగానే, ‘మిడ్‌నైట్‌రన్నర్స్‌’ మూవీ కూడా గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, వారు మెచ్చే అంశాలు అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఆకాంక్షలకు తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్‌ అవుతుందని ఆశిస్తున్నాము..’’ అని తెలిపారు.

Updated Date - 2021-07-26T22:11:03+05:30 IST